మెహర్ చంద్ మహాజన్
మూఢ విశ్వాసాలు ఎంత దుష్పరిమాణాలకైనా దారి తీస్తాయి. మనం పూర్వం కాశీ మజలీల్ కధల్లో చదివి వుంటాం. ఒక రాకుమారుడు కాని, రాకుమార్తెకాని పుట్టగానే వారి వల్ల తల్లి దండ్రులకు కీడు వాటిల్లుతుందని, మరణం తప్పదని ఏ జ్యోతీష్కుడో మిడిమిడి జ్ఞానంతో చెబుతాడు. ఆ దెబ్బతో బయపడిన తండ్రి తల్లికి మాతృ ప్రేమ వల్ల ఇష్టం లేకపోయినా ఆ పసికందును ఏ అడవిలోనో వదిలిపెట్టడం జరుగుతుంది!
అల్లంటి సంఘటన ఇటీవల కూడా నిజంగా జరిగింది. ఆ బిడ్ద పుట్టగానే తల్లిదండ్రుల పుట్టి మునుగుతుందని జోతిష్కుడు చెప్పిన మాట విని, పుత్ర ప్రేమని కూడ చంపుకుని, ఆ తల్లిదండ్రులు, అతడిని నిర్ధాక్షిణ్యంగా ఒక కొండపై వదిలి పెట్టారు.
ఆ బిడ్డను ఒక గొర్రెల కాపరి చూచి, పెంచి పెద్ద చేశాడు. విద్యాబుద్దులు చెప్పించాడు. అతడు ఆ తర్వాత కాశ్మీర్ ప్రధాని అయ్యాడు. ఆయన హయాం లోనే కాశ్మీర్ ఇండియాలో విలీనమైంది. అది 1947 అక్టోబర్ మాట. ఆ తరువాత అతడే మన సుప్రీంకోర్టు జడ్జీ అయినాడు. అటు పిమ్మట ఆ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినాడు.
ఆయన పేరు? మెహర్ చంద్ మహాజన్! ఇది కాశీ మజిలీ కదలా వుంది కదూ! కాదు అక్షరాల వాస్తవగాథ.
No comments:
Post a Comment