జాన్ హాన్కాక్
ఇలాంతి ఉదంతమే ఒకటి అమెరికా స్వాతంత్ర్య సమరం సాగుతున్న రోజులలో జరిగింది. అమెరికన్లు 18వ శతాబ్ది చివరలో తమ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారితో పోరాడుతున్నారు. అది సాయుధ పోరాటం-అమెరికాలోని బోస్టన్ నగరంలో బ్రిటీష్ సైన్యాలను జార్జివాషింగ్టన్ నాయకత్వంలోని అమెరికన్ సైనికులు దిగ్భందం చేశారు.
స్వాతంత్ర సమర సేనాని అయిన వాషింగ్టన్ అమెరికా పార్లమెంటుకు ఒక సందేశం పంపుతూ చక్రబంధంలో వున్న బోస్టన్ పై బాంబులు వేస్తేకాని బ్రిటీష్ సైనికులు లొంగరని,అందువల్ల బోస్టన్ నగరంపై బాంబులు వేయటానికి అనుమతించాలని కోరాడు.
ఈ సందేశాన్ని పార్లమెంటు అధ్యక్షుడైన జాన్ హాన్ కాక్ సభవారికి ప్రశాంతంగా చదివి వినిపించాడు. సభ్యులందరు దిగ్ర్భాంతి చెందారు ఎందువల్లంటే, పార్లమెంటు అధ్యక్షుడు హాన్కాక్ ఆస్తిపాస్తులన్ని బోస్టన్ నగరంలోనే వున్నాయి. ఆ నగరంపై బాంబులు వేస్తే ఆయన ఆస్తులన్నీ ధ్వంసమైపోతాయి. అందుకు హాన్కాక్ మాత్రమే కాదు, ఎవరైనా ఎందుకు అంగీకరిస్తారు? ఎలా సమ్మతిస్తారు?
సభికుల సందిగ్దతను గమనించిన హాన్కాక్ గంభీరంగా లేచి నిలబడి
" బోస్టన్ నగరంపై బాంబులు వేయటం వల్ల యుద్దం ముగిసి , మన దేశానికి బ్రిటీష్వారి నుంచి స్వాతంత్ర్యం వస్తుందంటే అంతకంటే కావలిసిందేమున్నది? నా సర్వస్వం పోతే మాత్రమేమి? బోస్టన్పై బాంబులు వేయటానికి వెంటనే ఉత్తరవు చేస్తున్నాను. " అని ప్రకటించేసరికి సభ్యులు ఆయన దేశభక్తికి, త్యాగ నిరతికి జోహార్లు అర్పిస్తూ ప్రశంసాధ్వానాలు చేశారు!
No comments:
Post a Comment