ఇందిరాగాంధీ
ఆమె తాత
మోతీలాల్ నెహ్రూకు అతిసన్నిహితుడైన ముస్లిం మిత్రుడు వుండేవాడు. ఆయన పేరు మున్షీ ముబారక్.
ఆయనకు
జవహర్లాల్ నెహ్రూకు ఒక
మగబిడ్డ పుడితె చూడాలని కోర్కె. అప్పటికి ఇంకా సంతానం కలగలేదు.
కొంతకాలానికి
ముబారక్కు జబ్బుచేసి మంచంపై ఉన్నాడు. వచ్చేప్రాణం, పోయే్ప్రాణంగా వుంది. అప్పుదే జవహార్లాల్ సతీమణీ
కమల ఒక బిడ్డను కన్నది.
ఆ బిడ్డను మోతీలాల్ తీసుకు వెళ్ళి ముబారక్కు చూపించాడు.
"అతడు ఆ
బిడ్డను జవహర్లాల్ కుమారునిగా భావించి" మోతిలాల్ భాయ్ సాబ్! ఈ
మనవడు నీ పేరు నిలుపుతాడు
" అని ఆశీర్వదించాడు.
వెంటనే
మోతీలాల్ " మగపిల్లవాడు కాదు, ఆడపిల్ల " అని
చెప్పేసరికి " అలాగా! ఆడపిల్ల అయినా సరే, వందమంది
కొడుకులకు దీటు అవుతుంది! " అని
తిరిగి అశీర్వదించి, తరువాత కోమాలోకి
వెళ్ళిపోయాడు. అంతే! ముబారక్ది
అదే ఆఖరిమాట! అదే అక్షరల నిజమైంది.
పెద్దదైన తరువాత ఇందిరాగాంధి వందమంది పురుష నాయకులకు ధీటుగా
నిలిచింది. తాను సాటిలేని నాయకురాలని
నిరూపించుకుంది.
No comments:
Post a Comment